సిరియా పై రష్యా, ఇరాన్, టర్కీ నేతల చర్చలు
- September 07, 2018
టెహరాన్ : సిరియా భవిత్యవంపై రష్యా, ఇరాన్, టర్కీ అధ్యక్షులు చర్చలు జరిపారు. ఏళ్ళ తరబడి సాగుతున్న అంతర్యుద్ధంతో సిరియా కకావికలమైంది. ఈ నేపథ్యంలో సిరియా భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మూడు దేశాల నేతలు చర్చించారు. సిరియా రెబెల్స్ అదుపులోని ఇడిలిబ్ ప్రావిన్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడ సైనిక దాడి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సిరియాలో కొనసాగుతున్న సైనిక సహకారంపై పుతిన్, రౌహని, ఎర్డోగన్ల మధ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. సిరియా ఘర్షణలతో నిర్వాసితులైన శరణార్ధులు స్వదేశానికి రావడం, ఘర్షణల సందర్భంగా గల్లంతైన, లేదా ప్రభుత్వం అరెస్టు చేసిన వారి భవితవ్యంపై దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







