సిరియా పై రష్యా, ఇరాన్, టర్కీ నేతల చర్చలు
- September 07, 2018
టెహరాన్ : సిరియా భవిత్యవంపై రష్యా, ఇరాన్, టర్కీ అధ్యక్షులు చర్చలు జరిపారు. ఏళ్ళ తరబడి సాగుతున్న అంతర్యుద్ధంతో సిరియా కకావికలమైంది. ఈ నేపథ్యంలో సిరియా భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మూడు దేశాల నేతలు చర్చించారు. సిరియా రెబెల్స్ అదుపులోని ఇడిలిబ్ ప్రావిన్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడ సైనిక దాడి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సిరియాలో కొనసాగుతున్న సైనిక సహకారంపై పుతిన్, రౌహని, ఎర్డోగన్ల మధ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. సిరియా ఘర్షణలతో నిర్వాసితులైన శరణార్ధులు స్వదేశానికి రావడం, ఘర్షణల సందర్భంగా గల్లంతైన, లేదా ప్రభుత్వం అరెస్టు చేసిన వారి భవితవ్యంపై దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







