సిరియా పై రష్యా, ఇరాన్, టర్కీ నేతల చర్చలు
- September 07, 2018
టెహరాన్ : సిరియా భవిత్యవంపై రష్యా, ఇరాన్, టర్కీ అధ్యక్షులు చర్చలు జరిపారు. ఏళ్ళ తరబడి సాగుతున్న అంతర్యుద్ధంతో సిరియా కకావికలమైంది. ఈ నేపథ్యంలో సిరియా భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మూడు దేశాల నేతలు చర్చించారు. సిరియా రెబెల్స్ అదుపులోని ఇడిలిబ్ ప్రావిన్స్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అక్కడ సైనిక దాడి జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. సిరియాలో కొనసాగుతున్న సైనిక సహకారంపై పుతిన్, రౌహని, ఎర్డోగన్ల మధ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. సిరియా ఘర్షణలతో నిర్వాసితులైన శరణార్ధులు స్వదేశానికి రావడం, ఘర్షణల సందర్భంగా గల్లంతైన, లేదా ప్రభుత్వం అరెస్టు చేసిన వారి భవితవ్యంపై దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడంపై ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









