23న 'ఆయుష్మాన్ భారత్'

- September 07, 2018 , by Maagulf
23న 'ఆయుష్మాన్ భారత్'

ఢిల్లీ:ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ఈనెల 23న ప్రధాని నరేంద్రమోడీ జార్ఖండ్ నుంచి ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని జార్ఖండ్ నుంచి ప్రారంభించడం మాకు గర్వకారణమని జార్ఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 3.25 కోట్ల మంది ప్రజలతో సహా భారతీయులంతా ఈ చారిత్రక సందర్భం కోసం ఎదురుచూస్తున్నారని చైనా పర్యటనలో ఉన్న జార్ఖండ్ సీఎం రఘువర్ దాస్ ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 23న ఈ కార్యక్రమం సందర్భంగా కోడర్మాలో మెడికల్ కాలేజీకి, చాయ్ బాసాలో కేన్సర్ ఆస్పత్రికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com