జార్జియా వెళ్తున్న 'సైరా' టీం
- September 07, 2018
చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార కథానాయిక. అమితాబ్బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్చరణ్ నిర్మాత. ఇటీవల హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు 'సైరా' టీమ్ జార్జియా వెళ్లబోతోంది. అక్కడ దాదాపు ఇరవై రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరిస్తారు. ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటుంది. తిరిగొచ్చాక మళ్లీ హైదరాబాద్లో మరో దఫా చిత్రీకరణ మొదలెడతారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్కి మంచి స్పందన వచ్చింది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సుదీప్, తమన్నా, నిహారిక, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం: రత్నవేలు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







