జార్జియా వెళ్తున్న 'సైరా' టీం
- September 07, 2018
చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార కథానాయిక. అమితాబ్బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్చరణ్ నిర్మాత. ఇటీవల హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు 'సైరా' టీమ్ జార్జియా వెళ్లబోతోంది. అక్కడ దాదాపు ఇరవై రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరిస్తారు. ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటుంది. తిరిగొచ్చాక మళ్లీ హైదరాబాద్లో మరో దఫా చిత్రీకరణ మొదలెడతారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్కి మంచి స్పందన వచ్చింది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సుదీప్, తమన్నా, నిహారిక, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం: రత్నవేలు.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







