జార్జియా వెళ్తున్న 'సైరా' టీం
- September 07, 2018
చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార కథానాయిక. అమితాబ్బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రామ్చరణ్ నిర్మాత. ఇటీవల హైదరాబాద్లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇప్పుడు 'సైరా' టీమ్ జార్జియా వెళ్లబోతోంది. అక్కడ దాదాపు ఇరవై రోజుల పాటు ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరిస్తారు. ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటుంది. తిరిగొచ్చాక మళ్లీ హైదరాబాద్లో మరో దఫా చిత్రీకరణ మొదలెడతారు. ఇటీవల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్కి మంచి స్పందన వచ్చింది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. సుదీప్, తమన్నా, నిహారిక, జగపతిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, ఛాయాగ్రహణం: రత్నవేలు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి