రజనీకాంత్కి భారీ సెక్యూరిటీ
- September 09, 2018
ఇటీవలి కాలంలో ఆగంతకులు షూటింగ్ స్పాట్కి వెళ్ళి రచ్చ చేయడం లేదంటే, లొకేషన్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం జరగుతూ వస్తుంది. ఈ క్రమంలో చిత్ర బృందంతో పాటు స్టార్ హీరోలకి ప్రభుత్వం భారీ సెక్యూరిటీ కలిపిస్తుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలో పూర్తి రాజకీయాలలోకి రానుండగా, ఆయనకి భద్రత మరింత పెంచారు. తన 165వ చిత్రం పేటా ప్రస్తుతం లక్నోలో షూటింగ్ జరుపుకుంటుంది. వారణాసిలోను కొన్ని రోజుల పాటు షూటింగ్కి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తలైవాకి 25 మంది పోలీసులతో కూడిన భారీ సెక్యూరిటీని కల్పించింది, అంతేకాదు ఆయన ఉండే ప్రాంతంలో ఎప్పుడూ ఓ మిలిటరీ పోలీసు వ్యాన్ పహారా కాస్తుందట. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్గా రూపొందుతున్న పేటా చిత్రాన్ని జిగర్తాండ ఫేం కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తుంది. విజయ్ సేతుపతి, సిమ్రన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







