రజనీకాంత్కి భారీ సెక్యూరిటీ
- September 09, 2018
ఇటీవలి కాలంలో ఆగంతకులు షూటింగ్ స్పాట్కి వెళ్ళి రచ్చ చేయడం లేదంటే, లొకేషన్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం జరగుతూ వస్తుంది. ఈ క్రమంలో చిత్ర బృందంతో పాటు స్టార్ హీరోలకి ప్రభుత్వం భారీ సెక్యూరిటీ కలిపిస్తుంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలో పూర్తి రాజకీయాలలోకి రానుండగా, ఆయనకి భద్రత మరింత పెంచారు. తన 165వ చిత్రం పేటా ప్రస్తుతం లక్నోలో షూటింగ్ జరుపుకుంటుంది. వారణాసిలోను కొన్ని రోజుల పాటు షూటింగ్కి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తలైవాకి 25 మంది పోలీసులతో కూడిన భారీ సెక్యూరిటీని కల్పించింది, అంతేకాదు ఆయన ఉండే ప్రాంతంలో ఎప్పుడూ ఓ మిలిటరీ పోలీసు వ్యాన్ పహారా కాస్తుందట. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్గా రూపొందుతున్న పేటా చిత్రాన్ని జిగర్తాండ ఫేం కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రజనీకాంత్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుంది. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని నిర్మిస్తుంది. విజయ్ సేతుపతి, సిమ్రన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి