2019 లో వస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్
- September 09, 2018
స్మార్ట్ ఫోన్ యూజర్స్ లో ఆసక్తి రేపుతున్న పోల్డబుల్ ఫోన్.. ఇక వచ్చే సంవత్సరమే పలకరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని శ్యాంసంగ్ మొబైల్ ప్రెసిడెంట్ డీజే కో స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి 2018లోనే పోల్డబుల్ ఫోన్ తీసుకురావాలనుకున్నామని, అయితే మరిన్ని టెస్ట్ లు జరపాల్సి ఉన్నందున 2019కి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ వెరైటీలో ఫోన్ ని పూర్తిగా తెరవకుండానే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అయితే బ్రౌజింగ్ చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా పూర్తిగా తెరవాల్సి వచ్చినప్పుడు ఫోల్డబుల్ వెరైటీతో ఉపయోగం ఏముంటుందని కస్టమర్ ఆలోచిస్తాడని, అందువల్ల దాని యూసేజ్ ని మరింత ఉపయోగకరంగా ఉండేలా చేయడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి త్వరలోనే శ్యాంసంగ్ నుంచి ఫోల్డబుల్ వెర్షన్ మొబైల్ వస్తోందన్నమాట.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







