హాస్య నటుడు కోవై సెంథిల్ కన్నుమూత
- September 09, 2018
తమిళనాడు, పెరంబూరు: హాస్య నటుడు కోవై సెంథిల్(74) ఆదివారం ఉదయం కోవైలో కన్నుమూశారు. పలు చిత్రాల్లో హాస్య పాత్రలతో పాటు, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించిన నటుడు కోవై సెంథిల్. ముఖ్యంగా ఈయన దర్శకుడు విక్రమన్ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. రజనీకాంత్ నటించిన పడయప్పా, కే.భాగ్యరాజ్ నటించి, దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆళు, వెంకట్ప్రభు తెరకెక్కించిన గోవా చిత్రాల్లో మంచి గుర్తింపు పొందాడు. కోవైలో నివశిస్తున్న కోవై సెంథిల్ ఇటీవల అనారోగ్యానికి గురై కోవైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రమే ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపారు. కోవై సెంథిల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోవై సెంథిల్కు సంతాపం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. గత 4వ తేదీన హాస్య నటుడు రాకెట్ రామనాథన్, 5వ తేదీన నటుడు వెళ్లై సుబ్బయ్య, ఇప్పుడు నటుడు కోవై సెంథిల్ ఇలా ఒకే వారంలో ముగ్గురు సీనియర్ నటులు మృతి చెందారన్నది గమనార్హం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!









