ఇండియన్ ఆర్మీలో లక్షన్నర ఉద్యోగాలకు కోత!
- September 10, 2018
న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీని మరింత ప్రభావవంతంగా, భవిష్యత్తు యుద్ధాలకు సన్నద్ధం చేసేలా కొన్ని కీలక చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కేడర్ రీవ్యూ నిర్వహించారు. కమిటీ సిఫారసు మేరకు వచ్చే నాలుగైదేళ్లలో లక్షన్నర ఉద్యోగాల్లో కోత విధించాలని ఇండియన్ ఆర్మీ భావిస్తున్నది. 12 లక్షల మందిగా ఉన్న ఆర్మీ బలగాల సంఖ్యను తగ్గించడంతోపాటు ఆర్మీలోని వివిధ విభాగాలను విలీనం చేసి వాటి పనితీరును మెరుగుపరచాలని క్యాడర్ రీవ్యూ సిఫారసు చేసింది. మిలిటరీ సెక్రటరీ లెఫ్ట్నెంట్ జనరల్ సంధు నేతృత్వంలోని 11 మంది సభ్యుల ప్యానెల్ ఈ సమీక్షను నిర్వహిస్తున్నది. ఈ నెల చివరిలోగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్కు తమ ప్రాథమిక నివేదికను సమర్పించనుంది.
నవంబర్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. వివిధ విభాగాలను విలీనం చేయడం, హేతుబద్ధీకరించడం వల్ల వచ్చే రెండేళ్లలో 50 వేల ఉద్యోగాల వరకు కోత పడుతుంది. 2022-23లోగా మరో లక్ష మంది బలగాలను తగ్గించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇదంతా ఇంకా అధ్యయన దశలోనే ఉంది అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఆర్మీ హెడ్క్వార్టర్స్లోని డైరెక్టరేట్స్, లాజిస్టిక్ యూనిట్లు, సమాచార వ్యవస్థలు, ఇతర పరిపాలన శాఖల్లోని విభాగాలను విలీనం చేయడం ద్వారా సిబ్బంది తగ్గింపు చర్యను చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!







