దుబాయ్లో రెండ్రోజులపాటు ఫ్రీ పార్కింగ్
- September 10, 2018
హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా సెప్టెంబర్ 13న సెలవు దినం కావడంతో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) రెండ్రోజులపాటు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తోంది. శనివారం సెప్టెంబర్ 15 నుంచి తిరిగి పార్కింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. గురువారం కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ మూసివేయబడ్తాయి. ఉమ్ అల్ రమూల్లో మాత్రం రౌండ్ ద క్లాక్ సేవలు అందుతాయి. ఇదిలా వుంటే దుబాయ్ మెట్రో రెడ్ లైన్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు అందుబాటులో వుంటాయి. గ్రీన్ లైన్ ఉదయం 5.30 నిమిషాల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తుంది. దుబాయ్ ట్రామ్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తుంది. బస్సులకు సంబంధించిన సమయాల్ని కూడా ఆర్టిఎ వివరించింది. మెట్రో సర్వీసులను లింక్ చేస్తూ మెట్రో లింక్ బస్సులు నడుస్తాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







