అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురు మృతి

- September 13, 2018 , by Maagulf
అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురు మృతి

కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం దుండగుడు కూడా తనని తాను కాల్చుకున్నాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన టుచేసుకుంది. బేకర్స్‌ఫీల్డ్‌లోని ఓ ట్రక్కింగ్‌ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్‌ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది.

కాగా, దుండగుడు ముందుగా నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చాడని, అనంతరం సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి మరో ఇద్దరిని హతమార్చి వాహనంలో ట్రక్కింగ్‌ కంపెనీ వద్దకు చేరుకుని మరోసారి కాల్పులు జరిపినట్లు సంస్థ వెల్లడించింది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో వారం వ్యవధిలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com