అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురు మృతి
- September 13, 2018కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్ సిటీలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం దుండగుడు కూడా తనని తాను కాల్చుకున్నాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన టుచేసుకుంది. బేకర్స్ఫీల్డ్లోని ఓ ట్రక్కింగ్ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది.
కాగా, దుండగుడు ముందుగా నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చాడని, అనంతరం సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి మరో ఇద్దరిని హతమార్చి వాహనంలో ట్రక్కింగ్ కంపెనీ వద్దకు చేరుకుని మరోసారి కాల్పులు జరిపినట్లు సంస్థ వెల్లడించింది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో వారం వ్యవధిలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం