అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురు మృతి
- September 13, 2018
కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్ సిటీలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అనంతరం దుండగుడు కూడా తనని తాను కాల్చుకున్నాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన టుచేసుకుంది. బేకర్స్ఫీల్డ్లోని ఓ ట్రక్కింగ్ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది.
కాగా, దుండగుడు ముందుగా నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చాడని, అనంతరం సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి మరో ఇద్దరిని హతమార్చి వాహనంలో ట్రక్కింగ్ కంపెనీ వద్దకు చేరుకుని మరోసారి కాల్పులు జరిపినట్లు సంస్థ వెల్లడించింది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో వారం వ్యవధిలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









