ఎడారిలో చిక్కుకున్న ఇద్దరు క్షేమం

- September 13, 2018 , by Maagulf
ఎడారిలో చిక్కుకున్న ఇద్దరు క్షేమం

యూఏఈ - సౌదీ అరేబియా బోర్డర్‌లోని ఎడారిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వారిని సౌదీ అరేబియన్‌ బోర్డర్‌ గార్డ్స్‌ క్షేమంగా రక్షించారు. బతా ప్రావిన్స్‌లో షర్కియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతింది. రియాద్‌లోని యూఏఈ ఎంబసీ ఈ ఘటన గురించిన సమాచారం అందించడంతో, పెట్రోల్స్‌ని సంఘటనా స్థలానికి పంపించారు. ఎడారిలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆఫ్‌ రోడ్‌ ఏరియాస్‌లో ప్రయాణించేవారు ఖచ్చితంగా సేఫ్టీ స్టాండర్డ్స్‌ని, ప్రోటోకాల్స్‌ని పాటించాల్సి వుంటుంది. అత్యవసర సందర్భాల్లో 994 నెంబర్‌ని సంప్రదించి సహాయాన్ని పొందవచ్చునని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com