హైదరాబాద్ లో నేడు, రేపు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
- September 14, 2018హైదరాబాద్ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ అప్గ్రేడేషన్ పనులు జరుగుతున్నందున ఈ మార్గంలో నడిచే పలు ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 10 సర్వీసులను శనివారం రద్దు చేయగా, ఆదివారం లింగంపల్లి-ఫలక్నుమా మధ్య నడిచే 47171 నంబరు ఎంఎంటీఎస్తోపాటు హైదరాబాద్-లింగంపల్లి మధ్య నడిచే 47100, 47101 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేశారు. అదేవిధంగా హైదరాబాద్-పూర్ణ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు శనివారం లింగంపల్లి నుంచి రాత్రి 10.17 గంటలకు బయల్దేరుతుందని, హైదరాబాద్-కొచువెల్లి మధ్య నడిచే స్పెషల్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 9.40 కి బయలుదేరుతుంది. పర్బానీ- హైదరాబాద్ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 11.10 గంటలకు బయల్దేరనుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?