చంద్రయాత్ర రాకెట్ ట్రావెల్స్.. తొలి టికెట్ బుక్కయిందట
- September 14, 2018చంద్రుని మీదకు అమెరికా వ్యోమగాములు తొలిసారి వెళ్లారు. నీల్ ఆమ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ 1969లో చంద్రునిపై కాలుమోపి చరిత్రకెక్కారు. 1972లో చివరియాత్ర జరిగింది. మొత్తం 24 మంది మాత్రమే చంద్రయాత్ర చేశారు. వారంతా వ్యోమగాములుగా శిక్షణ పొందినవారు. ఆ తర్వాత, మానవరహిత రాకెట్లు మాత్రమే చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-ఎక్స్ కంపెనీ చంద్రుని మీదకు రాకెట్ ట్రావెల్ సర్వీస్ ప్రారంభించింది. కాకలుతీరిన వ్యోమగాములేమిటి.. సామాన్యులూ చంద్రమండల యాత్ర చేసి తరించవచ్చని టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. అప్పుడే ఓ టిక్కెట్ అమ్ముడైంది కూడా. ఈ యాత్ర కోసం బిగ్ ఫాల్కన్ రాకెట్ అనేదానిని తయారు చేశారు. తొలి పర్యాటకుడు ఎవరో సెప్టెంబర్ 17న ప్రకటిస్తామని టెస్లా కంపెనీ సీఈవో కూడా అయిన మస్క్ ట్విట్టర్లో తెలిపారు. అయితే ఈ యాత్రలో కేవలం చంద్రుని చుట్టూ రాకెట్లో చక్కర్లు కొట్టడమే ఉంటుంది. కిందకు దిగితే ఎదురయ్యే ఇబ్బందులు మామూలు ప్రయాణికులైతే తట్టుకోలేరని ఇలా ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ