నవంబర్ 4 తరవాత ఇరాన్తో జతకట్టరాదు : అమెరికా
- September 15, 2018
వచ్చే నెల 4వ తేదీ నుంచి ఇరాన్తో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను బంద్ చేయాలని ప్రపంచ దేశాలకు అమెరికా హుకూం జారీ చేసింది. ఒకేవేళ ఎవరైనా ఆ దేశంతో లావాదేవీలు జరిపితే అలాంటి దేశాలతో తాము వ్యవహరించే తీరు భిన్నంగా ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హెచ్చరించారు. దీంతో భారత్ వంటి దేశాలు ఇబ్బందులు పడాల్సి ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై అమెరికా చర్యల ప్రభావం అధికంగా ఉంటుంది. తక్కువ ధరకు పైగా మన కరెన్సీలో ఇరాన్ నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. పైగా ఛబహార్ రేపు సిద్ధమైనందున మరింత చమురు దిగుమతి చేసుకునేందుకు సిద్ధమౌతున్న భారత్కు అమెరికా తాజా నిర్ణయం షాక్ కల్గిస్తోంది. మరోవైపు అమెరికాతో భారత్ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. నవంబర్ 4లోగా కొన్ని మినహాయింపులు లభించవచ్చని భారత్ ఆశిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి