కోల్కతా బాగ్రీ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
- September 15, 2018
పశ్చిమ్బంగ రాజధాని కోల్కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే బుర్రాబజార్ ప్రాంతంలోని బాగ్రీ మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఆరంతస్తుల దుకాణ సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 30 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆ దుకాణ సముదాయంలో 400 దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా ఫార్మా, నగల దుకాణాలు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఆ భవంతిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 'తెల్లవారుజామున 2.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకుంది. భవంతిలోని అన్ని అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు' అని నగర మేయర్ తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి