కోల్కతా బాగ్రీ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం
- September 15, 2018
పశ్చిమ్బంగ రాజధాని కోల్కతా నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే బుర్రాబజార్ ప్రాంతంలోని బాగ్రీ మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఆరంతస్తుల దుకాణ సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న 30 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆ దుకాణ సముదాయంలో 400 దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎక్కువగా ఫార్మా, నగల దుకాణాలు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఆ భవంతిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 'తెల్లవారుజామున 2.45 నిమిషాలకు ప్రమాదం చోటుచేసుకుంది. భవంతిలోని అన్ని అంతస్తులకు మంటలు వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు' అని నగర మేయర్ తెలిపారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







