ప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎఫ్2.!
- September 15, 2018
టాలీవుడ్ తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఒకటి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తుంది. ఎంతో ప్రస్టేజీయస్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ జోడి కట్టింది. చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్లు తోడళ్ళుగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర బేనర్పై దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలోనే చిత్ర టీజర్ ఒకటి విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా చిత్రంప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్లతో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. డిసెంబర్లో మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి