ప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎఫ్2.!
- September 15, 2018టాలీవుడ్ తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఒకటి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తుంది. ఎంతో ప్రస్టేజీయస్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ జోడి కట్టింది. చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్లు తోడళ్ళుగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర బేనర్పై దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలోనే చిత్ర టీజర్ ఒకటి విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా చిత్రంప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్లతో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. డిసెంబర్లో మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!