ప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎఫ్2.!
- September 15, 2018
టాలీవుడ్ తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాలలో ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఒకటి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తుంది. ఎంతో ప్రస్టేజీయస్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా కథానాయికగా నటిస్తుండగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ జోడి కట్టింది. చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్లు తోడళ్ళుగా కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర బేనర్పై దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అతి త్వరలోనే చిత్ర టీజర్ ఒకటి విడుదల చేసి మూవీపై భారీ అంచనాలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా చిత్రంప్రాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్లతో పాటు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. డిసెంబర్లో మూవీ విడుదలకి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







