మహర్షి షూటింగ్ కి ఫ్యామిలీతో యూఎస్ వెళ్ళనున్న మహేష్.!
- September 16, 2018
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. దిల్రాజు, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి అందాల నటి జయసుధనటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు 'మహర్షి'. చిత్రంలో మహేష్ విద్యార్థిగా, యూఎస్ కంపెనీ సీఈవోగా రిషీ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుండగా, త్వరలో మరో షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్ళనుంది. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుండగా, అక్కడికి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లనున్నాడట. యూఎస్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానుందని అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







