ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ : ఇమ్రాన్‌ఖాన్‌

- September 16, 2018 , by Maagulf
ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్ : ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్‌ ఆర్థికంగా దివాళా తీసిందని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. గత ప్రభుత్వాలు పాలనాపరమైన తప్పిదాల వల్లే దేశం పూర్తిగా దివాళా తీసిందన్నారు. గత ప్రభుత్వాలు సంపద పెంపు అంశాలను పట్టించుకోకుండా ఆర్థిక నష్టాలు తెచ్చే ప్రాజెక్టులు చేపట్టిన పాపమిదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాలనాపరమైన అవసరాలకు సరిపడా ఆర్థిక వనరులు కూడా ప్రభుత్వం వద్ద లేవని చెప్పారు. అవినీతి తగ్గితే అద్భుతాలు సృష్టించవచ్చునని, మనలో మార్పుకోసం భగవంతుడు ఈ పరీక్ష పెట్టాడని ప్రజలు భావించాలని ఇమ్రాన్‌ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com