మెర్జర్ వార్తల్ని ఖండించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 20, 2018
ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ ఎయిర్లైన్స్ విలీనం గురించి వస్తున్న వార్తల్ని ఆ రెండు సంస్థలూ ఖండించాయి. మిడిల్ ఈస్ట్లో టాప్ ఎయిర్ లైన్స్గా ఈ రెండు సంస్థలూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, మెర్జర్కి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఎతిహాద్ అధికార ప్రతినిథి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎమిరేట్స్, అబుదాబీ గవర్నమెంట్ నేతృత్వంలోని ఎతిహాద్ పౌర విమానయాన రంగంలో దూసుకుపోతున్నాయి. కొన్ని చోట్ల ఇరు సంస్థలూ పరస్పర సహకారం నిమిత్తం ఒప్పందాలు చేసుకున్నాయి. రెండేళ్ళపాటు తాత్కాలి పద్ధతిన ఎతిహాద్ పైలట్స్ ఎమిరేట్స్లో పనిచేయడానికి వీలుగా ఈ ఒప్పందాలున్నాయి. గత కొన్నాళ్ళుగా మెర్జర్పై ప్రచారం జరుగుతున్నా, ఆ దిశగా ఎలాంటి డెవలప్మెంట్స్ లేవని గల్ఫ్లో పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







