మెర్జర్ వార్తల్ని ఖండించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 20, 2018
ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ ఎయిర్లైన్స్ విలీనం గురించి వస్తున్న వార్తల్ని ఆ రెండు సంస్థలూ ఖండించాయి. మిడిల్ ఈస్ట్లో టాప్ ఎయిర్ లైన్స్గా ఈ రెండు సంస్థలూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, మెర్జర్కి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఎతిహాద్ అధికార ప్రతినిథి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎమిరేట్స్, అబుదాబీ గవర్నమెంట్ నేతృత్వంలోని ఎతిహాద్ పౌర విమానయాన రంగంలో దూసుకుపోతున్నాయి. కొన్ని చోట్ల ఇరు సంస్థలూ పరస్పర సహకారం నిమిత్తం ఒప్పందాలు చేసుకున్నాయి. రెండేళ్ళపాటు తాత్కాలి పద్ధతిన ఎతిహాద్ పైలట్స్ ఎమిరేట్స్లో పనిచేయడానికి వీలుగా ఈ ఒప్పందాలున్నాయి. గత కొన్నాళ్ళుగా మెర్జర్పై ప్రచారం జరుగుతున్నా, ఆ దిశగా ఎలాంటి డెవలప్మెంట్స్ లేవని గల్ఫ్లో పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి