మెర్జర్ వార్తల్ని ఖండించిన ఎమిరేట్స్, ఎతిహాద్
- September 20, 2018
ఎమిరేట్స్ మరియు ఎతిహాద్ ఎయిర్లైన్స్ విలీనం గురించి వస్తున్న వార్తల్ని ఆ రెండు సంస్థలూ ఖండించాయి. మిడిల్ ఈస్ట్లో టాప్ ఎయిర్ లైన్స్గా ఈ రెండు సంస్థలూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఎమిరేట్స్ అధికార ప్రతినిథి మాట్లాడుతూ, మెర్జర్కి సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఎతిహాద్ అధికార ప్రతినిథి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎమిరేట్స్, అబుదాబీ గవర్నమెంట్ నేతృత్వంలోని ఎతిహాద్ పౌర విమానయాన రంగంలో దూసుకుపోతున్నాయి. కొన్ని చోట్ల ఇరు సంస్థలూ పరస్పర సహకారం నిమిత్తం ఒప్పందాలు చేసుకున్నాయి. రెండేళ్ళపాటు తాత్కాలి పద్ధతిన ఎతిహాద్ పైలట్స్ ఎమిరేట్స్లో పనిచేయడానికి వీలుగా ఈ ఒప్పందాలున్నాయి. గత కొన్నాళ్ళుగా మెర్జర్పై ప్రచారం జరుగుతున్నా, ఆ దిశగా ఎలాంటి డెవలప్మెంట్స్ లేవని గల్ఫ్లో పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్న సీనియర్ బ్యాంకర్ ఒకరు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









