దోమల మందు తాగిన తమిళ బుల్లితెర నటి..

- September 21, 2018 , by Maagulf
దోమల మందు తాగిన తమిళ బుల్లితెర నటి..

తమిళ బుల్లితెర నటి నీలాణి సూస్తెడ్‌కు యత్నించింది. చెన్నైలో ఆలపాక్కంలోని తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే తన ప్రియుడు గాంధీలలిత్‌కుమార్‌ సూసైడ్ చేసుకోవడం వివాదంగా మారింది.

సహాయదర్శకుడు లలిత్‌కుమార్‌ని ప్రేమించి, సహజీవనం చేసిన నీలాణి అతనితో గొడవ పడి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. లలిత్‌కుమార్‌ వేధింపులకు గురిచేస్తున్నాడని మైలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలాణి. దీంతో మనస్తాపానికి గురైన లలిత్‌కుమార్ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని లలిత్‌కుమార్‌ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా నీలాణిని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో నీలాణి తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించటం సంచలనంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com