దోమల మందు తాగిన తమిళ బుల్లితెర నటి..
- September 21, 2018
తమిళ బుల్లితెర నటి నీలాణి సూస్తెడ్కు యత్నించింది. చెన్నైలో ఆలపాక్కంలోని తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే తన ప్రియుడు గాంధీలలిత్కుమార్ సూసైడ్ చేసుకోవడం వివాదంగా మారింది.
సహాయదర్శకుడు లలిత్కుమార్ని ప్రేమించి, సహజీవనం చేసిన నీలాణి అతనితో గొడవ పడి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. లలిత్కుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడని మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది నీలాణి. దీంతో మనస్తాపానికి గురైన లలిత్కుమార్ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ్ముడి చావుకు నీలాణినే కారణం అని లలిత్కుమార్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా నీలాణిని పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో నీలాణి తన ఇంట్లో దోమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించటం సంచలనంగా మారింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









