వియత్నాం ప్రెసిడెంట్ కన్నుమూత

- September 21, 2018 , by Maagulf
వియత్నాం ప్రెసిడెంట్ కన్నుమూత

వియత్నాం ప్రెసిడెంట్ ట్రాన్ డాయ్ క్వాంగ్(61) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శుక్రవారం కన్నుమూశారు. పది రోజులుగా తీవ్ర అనారోగ్యం కారణంగా హనోయ్ మిలిటరీ ఆసుపత్రిలో చేరారు ట్రాన్ డాయ్ క్వాంగ్.. ఆరోగ్యం విషమించడంతొ శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో కన్నుమూశారు. అయన మృతిచెందినట్టు వియత్నాం హనోయ్ మిలిటరీ హాస్పిటల్ ధృవీకరించింది. ఏప్రిల్ 2, 2016 క్వాంగ్ జాతీయ అసెంబ్లీ ఎన్నికై అధ్యక్ష పదవిని చేపట్టారు. అంతకంటే ముందు ఆయన వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిగా, HIV / AIDS నివారణ కమిటీ వైస్ హెడ్ గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com