లేక్ విక్టోరియా:బోటు మునక.. 86 మంది మృతి
- September 21, 2018
లేక్ విక్టోరియా: ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకున్నది. లేక్ విక్టోరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో 86 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 200 మంది ప్రయాణికులు ముగిని ఉంటారని అంచనా వేస్తున్నారు. ఉకోరా, బుగొలోరా దీవుల మధ్య బోటు మునిగింది. ఓవర్లోడ్తో వెళ్తున్న పడవ.. ఒకవైపు ఒరగడంతో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి బోటు కెపాసిటీ వందే అయినా.. ప్రమాద సమయంలో సుమారు 400 మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు. సుమారు వంద మందిని ఇప్పటికే రెస్క్యూ చేశారు. అందులో 37 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే బోటు ప్రయాణం కోసం ఎంత మందికి టికెట్లు ఇచ్చారో స్పష్టంగా తెలియడం లేదు. డేటా మెషీన్ కూడా ప్రమాదంలో పాడైపోయినట్లు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం స్థానికులు కూడా అధికారులకు హెల్ప్ చేస్తున్నారు. 1996లోనూ లేక్ విక్టోరియాలో పెను ప్రమాదం జరిగింది. భారీ నీటి సరస్సులో ఎంబీ బుకోబా బోటు మునిగింది. ఆ ప్రమాదంలో సుమారు వెయ్యి మందికి వరకు మరణించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







