యూఏఈలో రోడ్డు ప్రమాదం: ఒకరికి గాయాలు
- September 21, 2018
అబుదాబీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. 20 ఏళ్ళ ఎమిరేటీ యువకుడు, ఎస్యూవీని డ్రైవ్ చేస్తూ, అల్ దఫ్రా ప్రాంతంలో ఓ వాటర్ ట్యాంకర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆపరేషన్స్ రూమ్కి సమాచారం అందగానే, పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మదినాత్ జాయెద్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని కీలలు వ్యాపించి, రెండు వాహనాలూ దహనమయ్యాయి. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ దఫ్రా ట్రాఫిక్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సుహైల్ సయాహ్ అల్ మజ్రోయి సూచించారు. సంఘటనా స్థలంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







