ఆసియా కప్:బంగ్లాపై భారత్ ఘన విజయం
- September 21, 2018
దుబాయ్: ఆసియా కప్లో రోహిత్ శర్మ (83 నాటౌట్; 104 బంతుల్లో 5×4, 3×6) కనువిందు చేశాడు. తన సొగసరి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. అతడికి తోడుగా శిఖర్ ధావన్ విజృంభించడంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది. ఇంకా 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ విజయ తీరాలను చేరింది. మాజీ సారథి ఎంఎస్ ధోనీ (33; 37 బంతుల్లో 3×4) రోహిత్కు తోడుగా నిలిచాడు. అంతకు ముందు జడేజా (4), భువి (3), బుమ్రా (3) బంగ్లా నడ్డి విరిచారు. మెహది హసన్ (42; 50 బంతుల్లో 2×4, 2×6), మొర్తజా (26; 32 బంతుల్లో 2×4), మహ్మదుల్లా (25; 51 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు.
లక్ష్య ఛేదనను భారత్ ధాటిగా ఆరంభించింది. ధావన్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రోహిత్ నిలకడగా ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అర్ధశతకానికి చేరువైన గబ్బర్ను 14.2వ బంతికి షకిబ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాతే మొదలైంది రోహిత్ బాదుడు. కళ్లు చెదిరే బౌండరీలు, సిక్సర్లు ఉతికేశాడు. ఓ భారీ సిక్సర్తో అర్ధశతకం సాధించాడు. అంబటి రాయుడు (13; 28 బంతుల్లో 1×4) కాసేపే ఉన్నాడు. విజయ సమీకరణం సులభంగానే ఉండటంతో దినేశ్ కార్తీక్ (1; 3 బంతుల్లో) బదులు ఎంఎస్ ధోనీని బ్యాటింగ్కు పంపించారు. అతడు బంతికో పరుగు చొప్పున సాధించాడు. హిట్మ్యాన్, ధోనీ మూడో వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







