వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ రానుంది
- September 21, 2018
మెసేజింగ్ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ను వాట్సాప్ తీసుకొచ్చేందుకు టెస్ట్ కూడా చేస్తోంది. నోటిఫికేషన్ల కోసం కొత్తగా ఇన్లైన్ ఇమేజ్ స్టయిల్ను ఉపయోగించబోతుంది. అంటే వాట్సాప్కు మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్లో ఇమేజ్ ద్వారా నోటిఫై చేస్తుంది. అంతకముందు కూడా వాట్సాప్ నోటిఫికేషన్లో ఇన్లైన్ ఇమేజస్ను వాడింది. కానీ తాజాగా కొత్త మెసేజింగ్స్టయిల్ నోటిఫికేషన్ ఫార్మాట్లో దీన్ని తీసుకొస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్ను బీటా ఛానల్లో టెస్ట్ చేశారు. అయితే ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ 9 పై డివైజ్లకు మాత్రమే పనిచేయనుంది.
నోటిఫికేషన్ల కోసం తీసుకొస్తున్న ఈ ఫీచర్ జీఐఎఫ్లకు, వీడియోలకు పనిచేయదు. కేవలం చిన్న ఐకాన్ మాత్రమే ఇమేజ్ రూపంలో వస్తుంది. కేవలం ఆండ్రాయిడ్ పైలకు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. కాగా, పాత ఐఫోన్లన్నీ పాత ఆండ్రాయిడ్ వెర్షన్లతోనే రన్ అవుతున్నాయి. దీంతో వాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం లేదు. ఓరియో వెర్షన్ల బీటాలో కూడా ఈ ఫీచర్ కనిపించడం లేదు. కేవలం ఆండ్రాయిడ్ 9 పై వారికి మాత్రమే ఈ ఫీచర్. అంతేకాక ఆండ్రాయిడ్ బీటాలో కొత్త స్టికర్ ప్యాక్ను బిస్కెట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. కానీ ప్రస్తుతం ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులో లేదు. డిఫాల్ట్గా డిసేబుల్ అయింది. మెసెంజర్లో బిస్కెట్ పాపులర్ స్టిక్కర్ ప్యాక్. దీన్నే వాట్సాప్ కూడా తన యాప్లోకి తీసుకురావాలనుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







