లోయలో పడ్డ జీపు.. 13మంది మృతి

- September 22, 2018 , by Maagulf
లోయలో పడ్డ జీపు.. 13మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జీపు లోయలో పడటంతో 13మంది మృతిచెందారు. ఈ ఘటన షిమ్లాకు 150 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి షిమ్లావైపు వెళుతున్న జీపు తియుని రోడ్ స్నేయిల్ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో పది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురు మహిళలు ఒక చిన్నారి ఉన్నారని సూపర్డెంట్ అఫ్ పోలీస్ ఉమాపతి జాంవలీ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com