కొలంబో:లంకపై భారత్ ఘన విజయం
- September 22, 2018
కొలంబో: భారత మహిళల జట్టు మరో ఘన విజయం సాధించింది. శ్రీలంక మహిళల జట్టుతో శనివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూపర్ ఫామ్లో ఉన్న యువ క్రికెటర్ జెమీమా రోడ్రిగెజ్(57: 40 బంతుల్లో) అర్ధశతకంతో రాణించడంతో భారత్ అలవోకగా విజయాన్నందుకుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రైద్దెంది. 132 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ఇండియా ఆరంభంలో గొప్ప శుభారంభం లభించేదు. అయినప్పటికీ వన్డౌన్లో వచ్చిన జెమీమా ఆతిథ్య బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు సాధించింది. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా ఎలాంటి తడబాటుకు లోనుకాకుండా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసి 18.2 ఓవర్లలోనే భారత్ను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను 131/ 8కే భారత్ కట్టడి చేసింది. లంక బ్యాట్స్వుమెన్లలో శశికళ(35), నీలాక్షి డిసిల్వా(31) మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, హర్మన్ప్రీత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







