అమెరికాకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.!
- September 22, 2018
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాదిని పకృతి సేద్యం సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అదే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. న్యూయార్క్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 నాటికి పకృతి సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది.
చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టే అరుదైన అవకాశం కలిగింది . అంతే కాదు.. ప్రపంచానికే ఎంతో కీలకమైన ప్రకృతి సేద్యానికి సంబంధించిన అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. మామూలుగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం ప్రపంచ దేశాల అధినేతలకు మాత్రమే ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఈ వేదికపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. 23 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







