అమెరికాకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.!
- September 22, 2018
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాదిని పకృతి సేద్యం సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో అదే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. న్యూయార్క్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 నాటికి పకృతి సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది.
చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి హోదాలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టే అరుదైన అవకాశం కలిగింది . అంతే కాదు.. ప్రపంచానికే ఎంతో కీలకమైన ప్రకృతి సేద్యానికి సంబంధించిన అంశంపై కీలక ప్రసంగం చేయనున్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత- అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై చంద్రబాబు కీలక ప్రసంగం చేయనున్నారు. మామూలుగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అవకాశం ప్రపంచ దేశాల అధినేతలకు మాత్రమే ఉంటుంది. కానీ చంద్రబాబుకు ఈ వేదికపై ప్రసంగించాలంటూ ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. 23 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







