యూఏఈ ఆమ్నెస్టీ: ఆపదలో ఉన్నవారికి విమాన టికెట్లను ఇచ్చి ఆదుకున్న TRS NRI Cell
- September 23, 2018



ఖతార్:UAE క్షమాభిక్ష సందర్భంగా దుబాయ్ నుండి స్వస్థలాలకు వెళ్లడానికి విమాన టిక్కెట్లకు డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్న తెలంగాణ కార్మికులకు విమాన టిక్కెట్ సమకూర్చి ఆదుకున్నారు TRS NRI CELL నాయకులు.
TRS ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని మాట్లాడుతూ, NRI మంత్రి KTR, TRS NRI అడ్వైజర్ కల్వకుంట్ల కవిత మరియు TRS NRI కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆదేశాల మేరకు UAE లో వీసా గడువు ముగిసి స్వరాష్ట్రానికి వెళ్లలేక కష్టాలు పడుతున్న జగిత్యాల, హస్నాబాద్ కు చెందిన రాజేందర్ వావిలాల కు మరియు హైదరాబాద్, టోలీచౌకీ కి చెందిన మహమ్మద్ రిజ్వాన్ కు ప్రయాణ ఖర్చులు అందజేసి ఇంటికి తిరిగి వెళ్లే ఏర్పాటు చేసి ఆదుకోవడం జరిగిందన్నారు.
ఇందుకోసం విశేష క్రుషి చేసిన దుబాయ్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి సేవా సమితి సభ్యుడు,TRS నాయకులు, శేఖర్ గౌడ్ మరియు మిత్ర బృందానికి,సహాయ సహకారాలు అందించిన TRS ఖతర్ ఉపాధ్యక్షులు శోభన్ బందారపు,నర్సయ్య డోనికేని , ప్రమోద్ కేత్తే, విష్ణువర్ధన్ రెడ్డి, శంకర్ సుందరగిరిని అభినందించారు.
UAE క్షమాభిక్ష సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ను సంప్రదించాలని విజ్ఞప్తి చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన, (మాగల్ఫ్ ప్రతినిధి,)
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







