18,000 దిర్హామ్ల డిస్కౌంట్ ప్రకటించిన న్యూ దుబాయ్ స్కూల్
- September 24, 2018
దుబాయ్లో కొత్తగా ప్రారంభమైన ఓ స్కూల్, డిసెంబర్ 1 లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు మొదటి టెర్మ్ ఫీజుని మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్లో ఈ ఏడాది 13 కొత్త స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. వీటిల్లో ఒకటైన రినైస్సాన్స్ స్కూల్ - స్పోర్ట్స్ సిటీ తమ విద్యార్థులకు ఈ ఆఫర్ ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ స్కూల్లో క్లాసులు ప్రారంభమవుతాయి. కెజి 1 నుంచి గ్రేడ్ 4 వరకు తొలి ఏడాదిలో విద్యాభ్యాసం ఇక్కడ లభిస్తుంది. కెజి1, కెజి2 విద్యార్థులకు 14,000 దిర్హామ్ల డిస్కౌంట్ ఇస్తున్నారు. గ్రేడ్ 1 మరియు 2 విద్యార్థులకు 16,800 అలాగే గ్రేడ్ 3 మరియు 4 విద్యార్థులకు 18,000 దిర్హామ్లు డిస్కౌంట్ అందిస్తున్నట్లు స్కూలు యాజమాన్యం ప్రకటించింది. యూఎస్ కరికులమ్ ఈ స్కూల్లో అందిస్తారు. ఫౌండింగ్ ప్రిన్సిపల్ మిస్ జీతా నోబెల్స్ మాట్లాడుతూ, తాము ప్రకటించిన డిస్కౌంట్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..







