రోజాను నిమ్స్ కి తరలింపు..
- December 18, 2015
అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాట, అరెస్టు సందర్భంగా తీవ్రంగా గాయపడిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నాంపల్లి పోలీసు స్టేషన్ నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ ఆవరణలోని వైఎస్ఆర్ సీఎల్పీ ఆఫీసు వద్దకు వెళ్లబోతుండగా రోజాను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆమెను బయటకు పంపేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. అరెస్టు సమయంలో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో రోజా కింద పడిపోయారు. ఆమెను అదే పరిస్థితిలో నాంపల్లి పోలీసు స్టేషన్కు బలవంతంగా తరలించారు. అయితే స్టేషన్కు వెళ్లేలోపే ఆమె స్పృహతప్పి పడిపోయారు. దాంతో ఆమెను పోలీసు స్టేషన్ నుంచి అంబులెన్సులో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా, నాంపల్లి పోలీసు స్టేషన్ వద్ద ఎమ్మెల్యే రోజాను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్నా రోజాను అరెస్టు చేస్తారా.. ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని ఆయన మండిపడ్డారు. సస్పెండైన ఎమ్మెల్యేను అసెంబ్లీ ఆవరణలోకి కూడా రానివ్వరా, సస్పైండైతే సభలోకి రాకూడదు గానీ అసలు అసెంబ్లీప్రాంగణంలోకి కూడా రానివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









