శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్
- September 27, 2018
కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నెలసరి సమస్యల కారణం చూపుతూ (10-50 ఏళ్ల మధ్య వయసు గల) మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడంపై విధించిన నిషేధాన్ని సవాల్ పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు పలు దఫాలుగా విచారణ జరిపింది. దీనిపై శుక్రవారం తుది తీర్పు వెలువరిస్తూ.. మహిళలను దేవతలుగా పూజించే దేశంలో ఆలయంలో వారికి నిషేధం విధించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. పురుషులతో పోలిస్తే మహిళలు దేనిలోనూ బలహీనులు కారని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చంటూ 4-1 మెజార్టీతో తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







