'ఆసియా కప్-2018' కైవశం చేసుకున్న భారత్
- September 28, 2018
దుబాయ్: భారత జట్టు విజయానికి 14 ఓవర్లలో 63 పరుగులు కావాలి. ధోనితో పాటు కేదార్ జాదవ్ క్రీజ్లో ఉన్నాడు. అంతా భారత్కు అనుకూలంగానే సాగుతోంది. అయితే ఈ స్థితిలో డ్రామా మొదలైంది. ధోని ఔట్ కాగా, జాదవ్ కండరాలు పట్టేయడంతో పెవిలియన్కు వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే జడేజా, భువనేశ్వర్ 45 పరుగుల భాగస్వామ్యం వాటిని తుంచేసింది. ఆఖరి బంతికి లెగ్బై ద్వారా సింగిల్ రావడంతో భారత్ విజయం ఖాయమైంది. శుక్రవారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 3, జాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం







