అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న భారతీయులు
- September 28, 2018
అమెరికా: అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తున్న కారణంగా అరెస్టైన భారతీయుల సంఖ్య ఈ ఏడాది మూడు రెట్లు పెరిగిందని శుక్రవారం యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సిబిపి) వెల్లడించింది. అక్రమ రవాణాకు ఒక్కొక్క వ్యక్తికి 25వేల నుండి 50 వేల డాలర్ల చెల్లింపులు జరిగాయని, అమెరికా-మెక్సికో సరిహద్దుల నుండి వచ్చి ఆశ్రయం పొందుతున్నారని సిబిపి అధికార ప్రతినిథి సాల్వడోర్ జమోరా తెలిపారు. మోసపూరితమైన పిటిషన్లతో కూడిన ఆర్థిక వలసదారులు దేశంలోకి వస్తున్నారని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సెప్టెంబరు 30న ముగుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే గత ఏడాది ఆర్థిక సంవత్సరానికి 3, 162 మంది భారతీయులను అదుపులోకి తీసుకోగా ఈ ఏడాది సుమారు 9,000 మందిని అరెస్టు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







