ఇండోనేషియాలో సునామీ.. 48 మంది మృతి
- September 28, 2018
ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ బీభత్సానికి 48 మంది చనిపోయారు. సులవేసి ద్వీపంలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. సునామీ బీభత్సంతో తీరప్రాంతాల్లో చాలా మృత దేహాలను కనుగొన్నామని, ఖచ్చితంగా ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని ఇండోనేషియా జాతీయ విపత్తుల ఏజెన్సీ ప్రతినిధి నుగ్రోహో తెలిపారు. భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







