మసూద్కు చైనా అండ
- September 29, 2018
న్యూయార్క్ : ఉగ్రవాది అజర్ మసూద్కు చైనా మళ్లీ అండగా నిలిచింది. జేషే మొహమ్మద్ చీఫ్ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అందరి మధ్య ఏకాభిప్రాయం రావడం లేదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మసూద్ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్, పాక్ మధ్య ఒకేరకమైన అభిప్రాయాలు వ్యక్తం కావడం లేదని, ఒకవేళ ఏకాభిప్రాయం వస్తే తాము మద్దతు ఇస్తామని చైనా మంత్రి తెలిపారు. భద్రతా మండలిలో పర్మనెంట్ సభ్య దేశమైన చైనా.. మసూద్ను గ్లోబల్ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంలో అడ్డు చెబుతోంది. భారత్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో మసూద్ ప్రమేయం ఉందన్న విషయం తెలిసిందే. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా అడ్డుకున్నది. పఠాన్కోట్ దాడుల సూత్రధారిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో భారత్ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదన చేసింది. అయితే అమెరికా మసూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించేందుకు సిద్ధమైంది. కానీ అప్పుడు చైనా తనకు ఆగస్టు 2వ తేదీ వరకు డెడ్లైన్ ఇవ్వాలంటూ తెలిపింది. దాని ప్రకారమే అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించలేకపోయారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







