ఎన్టీఆర్ బయోపిక్పై క్రిష్ సంచలన నిర్ణయం..
- October 01, 2018
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్…ప్రతిష్టాత్మకంగా నటసింహం బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తోంది.
ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కే సినిమాలో, ఆయన జీవితంలో జరిగిన అన్ని బెస్ట్ మూమెంట్స్ ని తెరపైన చూపించడం కష్టమనే ఉద్ధేశ్యంతో, రెండు పార్టులుగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఆల్ రెడీ ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ కి డేట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. పక్కా ప్లానింగ్ తో దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జరుగుతోంది. ఒకవేళ ఈ సినిమాని రెండు పార్టులుగా తీస్తే.. సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు తీస్తారు అనే అనుమానులు కూడా ఉన్నాయి. కానీ దర్శకుడు క్రిష్, బాలకృష్ణ మాత్రం ఫస్ట్ పార్ట్ రిలీజైన నెల రోజులలోనే సెకండ్ పార్ట్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో చాలా మంది స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలనే బసవతారకం పాత్ర పోషిస్తోంది. ఇక ఎఎన్ఆర్ గా సుమంత్, చంద్రబాబు నాయుడుగా రానా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, జయప్రదగా రాశీఖన్నా..ఇంకా ఎన్టీఆర్ టైమ్ లో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ ని కూడా ఈ బయోపిక్ లో చూపించబోతున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు, ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారని తెలియడంతో సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా వస్తుందా లేదా అనే విషయంపై మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







