కేరళకు పొంచి ఉన్న మరో ప్రమాదం.. రెడ్ అలర్ట్
- October 04, 2018
కళ్ల ముందు కేరళ వరద దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. దేవుడికి ఇష్టమైన ప్రదేశంగా చెప్పుకునే కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అంతటి భారీ విపత్తునుంచి ఇంకా కోలుకోనే లేదు. గత వంద సంవత్సరాల్లో ఇలాంటి భీభత్సాన్ని ఎన్నడూ చూడని కేరళ వాసులు ఆ భయంకర రోజుల్ని తలుచుకుంటూ మళ్లీ మామూలు జీవనం సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రానున్న శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రబావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయింత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరారు.
తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రం మళ్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







