కేరళకు పొంచి ఉన్న మరో ప్రమాదం.. రెడ్ అలర్ట్
- October 04, 2018
కళ్ల ముందు కేరళ వరద దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. దేవుడికి ఇష్టమైన ప్రదేశంగా చెప్పుకునే కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అంతటి భారీ విపత్తునుంచి ఇంకా కోలుకోనే లేదు. గత వంద సంవత్సరాల్లో ఇలాంటి భీభత్సాన్ని ఎన్నడూ చూడని కేరళ వాసులు ఆ భయంకర రోజుల్ని తలుచుకుంటూ మళ్లీ మామూలు జీవనం సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రానున్న శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రబావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయింత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరారు.
తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రం మళ్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









