కేరళకు పొంచి ఉన్న మరో ప్రమాదం.. రెడ్ అలర్ట్
- October 04, 2018
కళ్ల ముందు కేరళ వరద దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. దేవుడికి ఇష్టమైన ప్రదేశంగా చెప్పుకునే కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అంతటి భారీ విపత్తునుంచి ఇంకా కోలుకోనే లేదు. గత వంద సంవత్సరాల్లో ఇలాంటి భీభత్సాన్ని ఎన్నడూ చూడని కేరళ వాసులు ఆ భయంకర రోజుల్ని తలుచుకుంటూ మళ్లీ మామూలు జీవనం సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో రానున్న శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రబావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయింత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపాలని కేంద్రాన్ని కోరారు.
తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని జాలర్లను హెచ్చరించారు. వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ రాష్ట్రం మళ్లీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







