మెర్స్తో సౌదీలో 10 మంది మృతి
- October 04, 2018
మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) కారణంగా సౌదీ అరేబియాలో జూన్ నుంచి మొత్తం 32 మంది అనారోగ్యానికి గురికాగా, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకునమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మెర్స్ కేసుల సంఖ్య 2,254 కాగా, 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మనుషుల్లో తొలిసారిగా మెర్స్ని సౌదీ అరేబియాలో 2012లో గుర్తించారు. క్రమక్రమంగా ఇది ప్రపంచమంతటా విస్తరించింది. మొత్తంగా ఈ వ్యాధి బారిన పడ్డవారిలో 1800 మంది సౌదీ అరేబియాకి చెందినవారే. మెర్స్ కారణంగా రెస్పిరేటరీ సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోతారు. హెల్త్ కేర్ విభాగంలోనివారికి ఈ వ్యాధిగ్రస్తుల నుంచి ముప్పు పొంచి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









