మెర్స్తో సౌదీలో 10 మంది మృతి
- October 04, 2018
మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) కారణంగా సౌదీ అరేబియాలో జూన్ నుంచి మొత్తం 32 మంది అనారోగ్యానికి గురికాగా, అందులో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుహెచ్వో) వెల్లడించింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 16 వరకునమోదైన కేసుల్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మెర్స్ కేసుల సంఖ్య 2,254 కాగా, 800 మంది ప్రాణాలు కోల్పోయారు. మనుషుల్లో తొలిసారిగా మెర్స్ని సౌదీ అరేబియాలో 2012లో గుర్తించారు. క్రమక్రమంగా ఇది ప్రపంచమంతటా విస్తరించింది. మొత్తంగా ఈ వ్యాధి బారిన పడ్డవారిలో 1800 మంది సౌదీ అరేబియాకి చెందినవారే. మెర్స్ కారణంగా రెస్పిరేటరీ సమస్యలు తలెత్తుతాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్య కారణంగా ప్రాణాలు కోల్పోతారు. హెల్త్ కేర్ విభాగంలోనివారికి ఈ వ్యాధిగ్రస్తుల నుంచి ముప్పు పొంచి వుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..







