'సాహూ'హీరోయిన్ కి డెంగ్యూ..ఆసుపత్రిలో చికిత్స!
- October 05, 2018
బాలీవుడ్ అందాల భామ శ్రద్దా దాస్ కి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలీవుడ్ లో విలన్, క్యారెక్టర్, కామెడీ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు శక్తికపూర్ కూతురు శ్రద్దా కపూర్ 'ఆషికీ 2' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలు, యాడ్స్ లో నటిస్తున్న శ్రద్దా కపూర్ తెలుగు లో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సాహూ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఈ మద్య బయోపిక్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్దా కరపూర్ నటిస్తుంది.
ఇందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ చిత్రీకరణకు సడెన్గా బ్రేక్ ఇచ్చింది. వైద్య పరీక్షల్లో శ్రద్ధాకు డెంగ్యూ సోకినట్టు తేలిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆమె డెంగ్యూ కోసం చికిత్స తీసుకుంటోందని కొన్ని రోజుల అనంతరం ఆమె తిరిగి చిత్రీకరణలో పాల్గొంటుందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
అనారోగ్యం కారణంగా శ్రద్ధా మరికొద్ది రోజులపాటు చిత్రీకరణకు హాజరు కాలేకపోవచ్చు కాబట్టి దర్శకుడు అమోల్ గుప్త తెలిపారు. ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ ఆమె చిన్ననాటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కాగా, శ్రద్దా చిత్రీకరణలో ఎప్పుడు పాల్గొనేది త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి