బంగారం ధర భారీగా తగ్గింది...
- October 05, 2018
మగువల మనసు దోచే బంగారం గత రెండు రోజులుగా పెరిగి వారిని నిరాశ పరిచాయి. అయితే నేడు భారీగా తగ్గి ఊరిస్తోంది. బంగారు ఆభరణాలంటే మక్కువ చూపే వారు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకునే నిమిత్తం బంగారం దుకాణాలకు క్యూకడుతున్నారు. నేటి ట్రేడింగ్లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.250 తగ్గి రూ.31,850కు చేరుకుంది.
వెండి కూడా కిలోకి రూ.100లు తగ్గి రూ.39,250కి చేరుకుంది.
అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన పరిస్థితులు మరియు వ్యాపారస్తుల నుంచి వచ్చే ఆర్డర్స్ తగ్గడమే బంగారం ధర పతనానికి కారణమైందని ట్రేడింగ్ వర్గాలు వెల్లడించాయి. న్యూఢిల్లీలో స్వచ్ఛమైన పసిడి ధర రూ.250 తగ్గి రూ.31,850కి చేరుకోగా 99.5 నాణ్యత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.31,700గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.16 శాతం తగ్గి జౌన్సు 1,199.40 డాలర్లు పలికింది. ఇక వెండి కూడా 0.03 శాతం తగ్గి ఔన్స్ 14.64 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







