తెలంగాణ:మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ ప్రెస్మీట్..
- October 05, 2018
తెలంగాణలో ముందస్తు ఎన్నికల షెడ్యూల్పై ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ ప్రెస్మీట్ ఉండడంతో అందరి దృష్టీ ఢిల్లీపై పడింది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీలకు షెడ్యూల్ విడుదల చేస్తారని దాదాపు స్పష్టమైంది. అయితే.. వాటితో పాటుగా తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తారా? ఇప్పుడిదే అందరిలో ఉత్కంఠ రాజేస్తోంది.
ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే.. తెలంగాణకు కలిపి ఎన్నికలు నిర్వహించవచ్చని కొన్నాళ్లుగా ప్రచారం జరిగింది. కేంద్రంతో, ఈసీతో మాట్లాడుకునే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఓటర్ల జాబితాపై పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉండగా.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తుందా? దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం విమర్శల పాలవుతోంది. నిజానికి మధ్యాహ్నం 12న్నర గంటలకు సీఈసీ ప్రెస్మీట్ జరగాల్సి ఉండగా.. మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసుకున్నారు. దీని వెనుక కేంద్రం ఒత్తిడి ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్తాన్లో మోడీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒంటి గంటకు సభ ఉంది. ఈలోపు షెడ్యూల్ ప్రకటిస్తే.. మోడీ సభకు ఎన్నికల కోడ్ పరిమితులు ఏర్పడతాయి. అందుకనే.. మోడీ సభ ముగిశాక.. 3 గంటలకు షెడ్యూల్ ప్రకటించబోతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







