తెలంగాణ:కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీర్మానాలు ఇవే..
- October 06, 2018
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు కాంగ్రెస్ నేతలు. ''అక్టోబర్ 9లోగా సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకోవాలి. 14 నాటికి అభ్యర్థుల జాబితా ప్రకటించాలి. డిపాజిట్ కోల్పోయిన వారికి టికెట్ ఇవ్వొద్దు. రెండుసార్లు ఓడిన వారికి టికెట్ ఇవ్వొద్దు. విశ్వసనీయత, గెలుపు ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక. కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర స్థాయిలోనే ఒక అభ్యర్థిని ఎంపిక చేసి హైకమాండ్కు లిస్టు పంపాలి. గెలిచే స్థానాలను మిత్రపక్షాలకు వదులుకోవద్దు. గెలుపు ప్రామాణికంగా పొత్తులు ఉండాలి.'' అని కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో సీపీఐకి ఇచ్చే సీట్లపై కూడా చర్చించారు. ఖమ్మంలో సీపీఐకి స్థానాలు ఇవ్వొద్దని నిర్ణయించారు. గత ఎన్నికల్లో సీపీఐకి మూడు స్థానాలు ఇస్తే డిపాజిట్ రాలేదని ఈ సమావేశంలో గుర్తు చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







