ఆఫ్రికాలో ప్రమాదం...50 మంది అగ్నికి ఆహుతి
- October 06, 2018
ఆయిల్ ట్యాంకర్ను మరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోగా... 100 మందికి పైగా గాయాలపాలైన ఘటన ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో జరిగింది. రాజధాని కిన్షాసాకు 130 కిలోమీట్ల దూరంలోని ఎమ్ బుటా గ్రామం దగ్గర జాతీయ రహదారిపై ఓ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... ట్యాంకర్ లోని ఆయిల్ పక్కనే ఉన్న ఇళ్లపై పడడం మంటలు అంటుకోవడంతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్యాంకర్ వెనుక, ముందు ఉన్న కార్లు, ఇతర వాహనాలకు కూడా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో జరిగిన ప్రమాదం నుంచి తెరుకునే బయటపడే పరిస్థితి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది... దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







