ఆఫ్రికాలో ప్రమాదం...50 మంది అగ్నికి ఆహుతి

- October 06, 2018 , by Maagulf
ఆఫ్రికాలో ప్రమాదం...50 మంది అగ్నికి ఆహుతి

ఆయిల్ ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోగా... 100 మందికి పైగా గాయాలపాలైన ఘటన ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో జరిగింది. రాజధాని కిన్షాసాకు 130 కిలోమీట్ల దూరంలోని ఎమ్ బుటా గ్రామం దగ్గర జాతీయ రహదారిపై ఓ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... ట్యాంకర్‌ లోని ఆయిల్ పక్కనే ఉన్న ఇళ్లపై పడడం మంటలు అంటుకోవడంతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్యాంకర్‌ వెనుక, ముందు ఉన్న కార్లు, ఇతర వాహనాలకు కూడా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో జరిగిన ప్రమాదం నుంచి తెరుకునే బయటపడే పరిస్థితి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది... దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com