ఆఫ్రికాలో ప్రమాదం...50 మంది అగ్నికి ఆహుతి
- October 06, 2018
ఆయిల్ ట్యాంకర్ను మరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోగా... 100 మందికి పైగా గాయాలపాలైన ఘటన ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో జరిగింది. రాజధాని కిన్షాసాకు 130 కిలోమీట్ల దూరంలోని ఎమ్ బుటా గ్రామం దగ్గర జాతీయ రహదారిపై ఓ వాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్న వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... ట్యాంకర్ లోని ఆయిల్ పక్కనే ఉన్న ఇళ్లపై పడడం మంటలు అంటుకోవడంతో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ట్యాంకర్ వెనుక, ముందు ఉన్న కార్లు, ఇతర వాహనాలకు కూడా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో జరిగిన ప్రమాదం నుంచి తెరుకునే బయటపడే పరిస్థితి కూడా లేకపోవడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది... దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!