టాలీవుడ్ కు మరో నిర్మాత వారసుడు తెరంగేట్రం
- October 06, 2018
ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. హీరోలు, దర్శక నిర్మాతల కుమారులు హీరోగా పరిచయమై ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత కుమారుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయన తన కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి డెబ్యూ చిత్రాన్ని కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివరాజ్ కనుమూరి తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. శివరాజ్ చెప్పిన కథ రాజ్ కందుకూరికి బాగా నచ్చడంతో ఈ స్టోరీతో తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తే.. బాగుంటుందని రాజ్ కందుకూరి భావిస్తోన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి