టాలీవుడ్ కు మరో నిర్మాత వారసుడు తెరంగేట్రం
- October 06, 2018
ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. హీరోలు, దర్శక నిర్మాతల కుమారులు హీరోగా పరిచయమై ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత కుమారుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయన తన కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి డెబ్యూ చిత్రాన్ని కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివరాజ్ కనుమూరి తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. శివరాజ్ చెప్పిన కథ రాజ్ కందుకూరికి బాగా నచ్చడంతో ఈ స్టోరీతో తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తే.. బాగుంటుందని రాజ్ కందుకూరి భావిస్తోన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







