టాలీవుడ్ కు మరో నిర్మాత వారసుడు తెరంగేట్రం
- October 06, 2018
ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతూనే ఉంది. హీరోలు, దర్శక నిర్మాతల కుమారులు హీరోగా పరిచయమై ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత కుమారుడు వెండితెర ఆరంగేట్రం చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించిన రాజ్ కందుకూరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈయన తన కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి డెబ్యూ చిత్రాన్ని కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా వచ్చిన 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాని తెరకెక్కించిన దర్శకుడు శివరాజ్ కనుమూరి తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. శివరాజ్ చెప్పిన కథ రాజ్ కందుకూరికి బాగా నచ్చడంతో ఈ స్టోరీతో తన కుమారుడిని తెలుగు తెరకు పరిచయం చేస్తే.. బాగుంటుందని రాజ్ కందుకూరి భావిస్తోన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







