సలమానియాలో బిల్డింగ్ కూలి నలుగురు మృతి
- October 10, 2018
బహ్రెయిన్లో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలెండర్ పేలుడు కారణంగా సలమానియాలోని ఓ భవనం కుప్ప కూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో ముగ్గురి మృతదేహాల్ని వెలికి తీశారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ వుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రీమియర్ పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా. ఇంటీరియర్, లేబర్, సోషల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీస్ ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రిన్స్ ఖలీఫా.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







