సలమానియాలో బిల్డింగ్‌ కూలి నలుగురు మృతి

- October 10, 2018 , by Maagulf
సలమానియాలో బిల్డింగ్‌ కూలి నలుగురు మృతి

బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు కారణంగా సలమానియాలోని ఓ భవనం కుప్ప కూలింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందినవారిలో ముగ్గురి మృతదేహాల్ని వెలికి తీశారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ వుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రీమియర్‌ పూర్తిస్థాయి విచారణ జరపాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా. ఇంటీరియర్‌, లేబర్‌, సోషల్‌ డెవలప్‌మెంట్‌, హెల్త్‌ అండ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్ట్రీస్‌ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ప్రిన్స్‌ ఖలీఫా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com