తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానానికి తప్పిన పెను ప్రమాదం...

- October 12, 2018 , by Maagulf
తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన  విమానానికి తప్పిన పెను ప్రమాదం...

తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 136 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ ప్రహరీ గోడను తాకుతూ వెళ్లింది. వెంటనే విమానశ్రయ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

తమిళనాడు లోని తిరుచ్చి విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే విమానం తాకడంతో అక్కడ ఉన్న గోడ కుప్పకూలింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని ముంబయికి దారి మళ్లించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో ముంబాయి నుంచి దుబాయ్‌కి తరలించారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com