తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానానికి తప్పిన పెను ప్రమాదం...
- October 12, 2018
తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 136 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను తాకుతూ వెళ్లింది. వెంటనే విమానశ్రయ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
తమిళనాడు లోని తిరుచ్చి విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే విమానం తాకడంతో అక్కడ ఉన్న గోడ కుప్పకూలింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని ముంబయికి దారి మళ్లించారు. ముంబయి ఎయిర్పోర్టులో విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో ముంబాయి నుంచి దుబాయ్కి తరలించారు అధికారులు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి