గోరు వెచ్చని నీళ్లు.. గుండెకు పదిలం..
- October 18, 2018
గుప్పెండంత గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాగించేది. నిరంతరాయంగా పని చేస్తున్న గుండె ఓ క్షణకాలమైనా అలసి పోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. మంచి ఆహారంతో పాటు, వ్యాయామం, గోరు వెచ్చటి నీటితో స్నానం లాంటివి పాటిస్తే మంచిది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.
జపాన్ పరిశోధకులు సుమారు ఎనిమిదివందలమంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చనీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈరోజునుంచే పాటించేస్తే గుప్పెండంత గుండె భద్రం.
తాజా వార్తలు
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!







