పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ.. నడిచిన తండ్రి
- October 18, 2018
ఒడిశా:ఒడిశాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వాహనానికి డబ్బులు లేక పోస్టుమార్టం కోసం కన్న కూతురి మృతదేహాన్ని 8 కిలోమీటర్ల మోసుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల తితలీ తుఫాన్ గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. తుఫాను దాటికి సర్వం కోల్పోయిన వారిలో అతంక్పూర్ గ్రామానికి చెందిన ముకుంద్ కుటుంబం కూడా ఒకటి. ఉండే ఇల్లు కూలిపోయింది, నాలుగు రోజులుగా ఆహరం లేదు. ఇదిలావుంటే గత ఆదివారం ముకుంద్ తన పదకొండేళ్ల కూతురు బబిత కనిపించకుండా పోయింది. ఆమె ఊరు శివారులో కొండచరియలు విరిగిపడి చనిపోయిందని తెలిసింది. దాంతో వరద కష్టాల్లో ఉన్న ముకుంద్ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది. బబిత మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యడం కోసం ఆసుపత్రికి తీసుకురావాలని తండ్రికి సూచించారు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ముకుంద్.. వాహనానికి డబ్బులు లేక కూతురు మృతదేహాన్ని 8 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఇంతలో సమీప గ్రామ ప్రజలు విచారించగా వాహనం సమకూర్చుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. ఇలా రావలసి వచ్చిందని సమాధానం చెప్పాడు. దాంతో చలించిపోయిన గ్రామస్థులు కొందరు.. వెంటనే వాహానం ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించారు. కాగా బబిత ఘటనపై విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







