సిగరెట్ పొగతో నిండిన గదిలో శ్రియ..
- October 22, 2018
అందాల తార శ్రియ శ్రీమతిగా మారిన తరువాత వస్తున్న మొదటి చిత్రం వీర భోగ వసంత రాయలు. ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న శ్రియ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న శ్రియ ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించినట్లు చెప్పింది.
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు గది అంతా సిగరెట్ పొగతో నిండిపోయిందని తెలిపింది. పొగకు గది ఉన్నవారంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఇలాంటి సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ సినిమా రిజల్ట్ చూసి అవన్నీ మరచిపోతామని చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది అని చిత్ర నిర్వాహకులు తెలియజేసారు. ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పారావ్ బెల్లాన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







