సిగరెట్ పొగతో నిండిన గదిలో శ్రియ..
- October 22, 2018
అందాల తార శ్రియ శ్రీమతిగా మారిన తరువాత వస్తున్న మొదటి చిత్రం వీర భోగ వసంత రాయలు. ఓ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న శ్రియ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొన్న శ్రియ ఓ వైవిధ్యభరితమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. సిగరెట్ తాగడం, మందు కొట్టే సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించినట్లు చెప్పింది.
ఒక గదిలో ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు గది అంతా సిగరెట్ పొగతో నిండిపోయిందని తెలిపింది. పొగకు గది ఉన్నవారంతా ఇబ్బంది పడ్డామని చెప్పింది. ఇలాంటి సీన్లు చేయడం చాలా కష్టంగా అనిపించినప్పటికీ సినిమా రిజల్ట్ చూసి అవన్నీ మరచిపోతామని చెప్పింది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దేశభక్తి నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథ ఇది అని చిత్ర నిర్వాహకులు తెలియజేసారు. ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పారావ్ బెల్లాన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్







